నెల్లూరు జిల్లా నందు చారిత్రాత్మక జొన్నవాడ పుణ్య క్షేత్రంలో జల కాలుష్యం పై లోగడ మధు అనే స్ధానికుడు జాతీయ హరిత ట్రిబ్యునల్ నందు ఫిర్యాదు చేయగా, సుమోటో గా విచారణ చేపట్టిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్, నెల్లూరు కలెక్టర్ గారి నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు ఈ రోజు జొన్నవాడను లో పర్యటించి స్ధానిక అతిధి గృహాలు, లాడ్జ్ లు, హోటల్ ల నుంచి వచ్చే మురికి నీరు మరియు గుడి నుంచి వచ్చే వ్యర్ధాలను నదిలోకి ఏలా వదులుతున్నారనే దానిపై పరిశీలన చేసినారు. ఇందు వెంట చెన్నై నుండి వచ్చిన ప్రాంతీయ హరిత ట్రిబ్యూనల్ అధికారులు, ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు మరియు నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారు క్షేత్ర స్ధాయిలో పరిశీలన జరిపి వివరాలు సేకరించినారు.