భారత ప్రధాన న్యాయమూర్తి గారు తన మొదటి తీర్పుగా అడవుల పైనే

Share Now

BR గవై గారు భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన తరువాత తన మొట్టమొదటి తీర్పుగా, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏదేని ప్రైవేట్ పార్టీలకు అటవీ భూమిని అటవీ ప్రయోజనాలకు కొరకు కాకుండా మరి ఏదైనా ఇతర అవసరాలకు వినియోగించి ఉన్నారా అనే దానిపై తీర్పునిచ్చారు.
1998వ సంవత్సరం పూణే నందు మహారాష్ట్ర ప్రభుత్వము చట్టవిరుద్ధంగా జరిపిన అటవీ భూముల కేటాయింపులపై 27 సంవత్సరాల తరువాత సుదీర్ఘ తీర్పునిచ్చారు. ఈ తీర్పు ద్వారా ప్రభుత్వాలు ఇకపై ఏదేని రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గాని అక్రమంగా అటవీ భూములు కట్టబెట్టే విధానంపై తీర్పునివ్వడం జరిగినది. ఈ తీర్పు ద్వారా ఇకపై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అక్రమ పద్ధతుల్లో అటవీ భూములను అటవీ అవసరాలకు తప్ప మరే ఇతర అవసరాలకు కేటాయించడానికి లేదా వినియోగించడానికి వీలుపడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *