భారీ పేలుల్ల కుట్రను భగ్నం చేసిన హైదరాబాద్ పోలీసులు

Share Now

జంట నగరాలలో భారీ పేలుళ్లకు చేసిన కుట్రని తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. ఇందుకు ప్లాన్ చేసిన ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు.

విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రహ్మాన్(29) అనే వ్యక్తి, హైదరాబద్‌కు చెందిన సయ్యద్ సమీర్(28) విజయనగరంలో పేలుడు పదార్ధాలు కొనుగోలు చేసి.. హైదరాబాద్‌లో పేలుళ్లకు స్కెచ్ వేశారు. సౌదీ అరేబియా నుంచి ఐసిసి మాడ్యూల్‌ ద్వారా వీరికి ఆదేశాలు వచ్చాయి. దీంతో పోలీసులు ఒక ఇంట్లో తనిఖీలు చేయగా, పేలుళ్ల కొరకు వినియోగించే నిషేదిత అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పధార్ధాలు లభించాయి. పేలుళ్లకు ప్రయత్నించిన సదరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు త్వరలో వారిని కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *