దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా మహమ్మారి, జూన్ 2, నాటికి దేశం మొత్తం మీద 3961 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదైనాయి. జనాభా నిష్పత్తిలో చూస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేకున్ననూ దీనిపై అప్రమత్తత మాత్రం చాలా అవసరం. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1435 కేసులు నమోదైనవి ఆ తరువాతి స్థానంలో దేశ రాజధాని డిల్లీలో 483 కేసులు నమోదుకాగా, మహారాష్ట్ర లో 506, వెస్ట్ బెంగాల్ నందు 331, గుజరాత్ 338, ఓడిస్సా లో 12 కేసులు నమోదైనాయి. ఆంధ్రప్రదేశ్ నందు ఏలాంటి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాకున్ననూ వైధ్య ఆరోగ్య శాఖ అధికారులు కోవిడ్ అప్రమత్తత ప్రకటించినారు తప్పని సరిగా మాస్క్ లు ధరించవలెనని ప్రజలకు పిలుపు నిచ్చారు. అలాగే ICMR డైరెక్టర్ జనరల్ DR.రాజీవ్ బన్సాల్ గారు ప్రస్తుతం దేశంలో వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ సబ్ వేరియంట్ జాతి అయిన LF7, XFG, JN1, NB 1.8.1 రకాలకు చెందినవిగా తెలిపారు, వీటి వల్ల పెద్దగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం లేదని తెలిపారు.