నెల్లూరు జిల్లాలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు, ఘన స్వాగతం పలికిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు ఇతర జిల్లా టిడిపి నాయకులు.
నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, ఈదగాలి గ్రామంలో ఏర్పాటు చేసిన విశ్వ సముద్ర బయో ఇధనాలు ప్లాంట్ ను ప్రారంబించిన చంద్రబాబు నాయుడు, అలాగే చింతా శశిదర్ ఫౌండేషన్ వారి నంద గోకులం లైఫ్ స్కూల్ ను ప్రారంబించారు. ఇందులో పేద బాలురకు ఉచిత విద్యను అందించనున్నట్లు యాజమాన్యం తెలిపారు. ఇందులో విద్యార్ధులకు విద్యతో పాటుగా క్రమశిక్షణ, నైపుణ్యత తదితరాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు.