ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు మహిలల వివాహం

Share Now

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదాయూ పట్టణంలో ఇద్దరు మహిళలు పరస్పర అంగీకారంతో వివాహం చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా వీరు పరస్పర అర్థం చేసుకుంటూ కలిసి జీవిస్తున్నారు. పురుషులతో సంబంధం పెట్టుకోవాలన్న ఆసక్తి తమకు లేదని స్పష్టం చేసిన ఈ ఇద్దరూ, బదాయూ కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో సంప్రదాయబద్ధంగా దండలు మార్చుకొని వివాహ బంధాన్ని స్వీకరించారు.

వీరి నిర్ణయానికి న్యాయవాదులు సహా కొంతమంది స్నేహితులు సాక్ష్యమయ్యారు. సామాజికంగా ఇటువంటి సంఘటనలు విచిత్రంగా అనిపించవచ్చుగానీ, ప్రస్తుత చట్టాల ప్రకారం పరస్పర అంగీకారంతో ఇద్దరు పెద్దల మధ్య బంధాన్ని ఏర్పరచుకోవడం సాధ్యమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *