కూటమి పాలన ఏడాది పూర్తయిన సంధర్బంగా

Share Now

కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సందేశంగా, జూన్4వ తేదీని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజుగా, ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజుగా, అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజుగా, ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు, ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజుగా అభివర్ణించినారు. ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నాం. ప్రజల ఆశలు, ఆకాంక్షల నెరవేర్చేందుకు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి సంక్షేమాన్ని అందిస్తూ, అభివృద్ధి పట్టాలెక్కించాం అని. రాష్ట్ర దశ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను అని. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నాము. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు తెలిపినారు. అలాగే నారా లోకేష్ బాబు తన సందేశంగా ఈరోజు ని ప్రజా తీర్పు దినంగా, ప్రజాస్వామ్యం గెలిచిన రోజుగా అభివర్ణించారు. జనసేన మరియు కూటమి పార్టీల ఆధ్వర్యంలో పలుచోట్ల కార్యకర్తలు సంభరాలు జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *