జ్యోతి మల్హోత్రా హర్యానా రాష్ట్రం హిస్సార్ ప్రాంతానికి చెందిన యూట్యూబర్ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో భారతదేశ సైనిక రహస్యాలను పాకిస్ధాన్ గూడాచార సంస్ధలకు చేరవేశారన్న నేరంపై అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ యూట్యూబర్ పెహల్గావ్ కాల్పుల తరువాత డిల్లీ లోని పాక్ రాయబార కార్యాలయం వద్ద కేక్ తో హడావిడి చేసిన ఓ రాయబార కార్యాలయ ఉద్యోగితో దిగిన పలు ఫోటోలు కూడా లభ్యమైనట్లు తెలిసింది.

అదేవిదంగా పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారి దనిష్ తో తరచుగా కలిసినట్లు మరియు సంభాషించినట్లు తేలింది. ఈ మద్య కాలంలో పలుమార్లు పాకిస్ధాన్ ను సంధర్శించినట్లు అలాగే ఓకసారి చైనా దేశంనూ సందర్శించినట్లు ధృవీకరించారు. ఈ దనిష్ ఇటీవలే భారత విదేశాంగ శాఖ 24 గంటలలొ దేశం విడిచి వెల్లమన్న పాకిస్ధాన్ దౌత్య కార్యాలయ అదికారి. అదికారులు ఈమెకు సంభందించిన బ్యాంకు అకౌంట్లు, డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ గాడ్జెట్లను పరిశీలిస్తున్నారు, విదేశీ పర్యటనలలో విలాసవంతమైన జల్సాలు చేసినట్లు, ఫ్లైట్లలో ఏగ్జిక్యూటివ్ శ్రేణి లో ప్రయాణించినట్లు తెలిపారు. ఈమెకు తన యూట్యూబ్ చానల్ Travel With JO నందు 3.77 లక్షల సబ్స్రైబర్స్ అలాగే ఇన్టాగ్రమ్ నందు 1.33 లక్షల ఫాలోయర్స్ కలరు. ఆపరేషన్ సింధూర్ తరువాత దేశ ధ్రోహం పై ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 11మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.(PTI/ANI)