తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల (థియేటర్ ఓనర్లు) కీలక నిర్ణయం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన 65 మంది ఎగ్జిబిటర్లు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చి చేప్పటం జరిగింది, ఎగ్జిబిటర్ల నిర్ణయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ప్రొడ్యూసర్ గిల్డ్ లకు తెలపనున్మామని తెలిపిన తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు ,ప్రదర్శన దారులు
ప్రొడ్యూసర్లు తమకు సహకరించకపోతే జూన్ 1నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకొన్నామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది, చాలా రోజులుగా సింగిల్ స్క్రీన్స్ ప్రదర్శన దారులకు వారాంతపు అద్దె చెల్లించి ప్రదర్శించుకోవటం జరుగుతుంది, ఇటీవల కాలంలో సినిమా టిక్కెట్ రేట్స్ ప్రభుత్వాల వద్ద పెంపొందించుకొని నిర్మాత, పంపిణీదారులు లబ్ది పొందినప్పటికి తమకు కేవలం నామమాత్రమైన అద్దె మాత్రమే చైల్లించుచున్నారన్న ఆవేదన ను ప్రదర్శన దారులు వ్యక్తం చేయడం జరిగింది, మల్టిఫ్లెక్స్ ల ప్రదర్శన మాత్రం కలెక్షన్ నిష్పత్తిలో చైల్లించటం జరుగుతుందని వారు తమ ఆక్రోశాన్ని వెల్లడించారు.