విశాఖపట్నం అడ్డాగా సైబర్ క్రైమ్ కాల్ సెంటర్

Share Now

విశాఖపట్నం, అచ్యుతాపురం సెజ్ నందు గల ఓక కాల్ సెంటర్ పై పోలీసుల సోదాలతో దాదాపుగా 100 మంది దొరికినట్లు తెలిపారు వీరిని ఓక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. అచ్యుతాపురం సెజ్ అడ్డాగా గత రెండు సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా ఓక కాల్ సెంటర్ నడుస్తోంది ఇందులో నుండి అమెరికా, లండన్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు అక్రమ కాల్స్ ద్వారా సైబర్ క్రైమ్ నకు పాల్పడుతున్నట్లు తెలిసింది, గత 4 నెలలుగా సైబర్ ఫోర్సేనిక్ అదికారులు దీనిపై నిఘా పెట్టి ఏట్ట కేలకు మే21 రాత్రి న ఈ కాల్ సెంటర్ పై అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు, ఇందులో 100 మంది పైబడి పనిచేస్తున్నట్లు తెలియవచ్చింది. వీరంతా ఏక్కువగా ఉత్తర భారత దేశ ఉద్యోగులే ఉన్నారు, వీరిలో చాలా మందికి ఇది నేరం అని తెలియక ఉధ్యోగంలో చేరినట్లు చెప్పారు. అంతే కాకుండా వీరిని రిక్రూట్ చేసిన విధానం కూడా అమెరికన్ ఇంగ్లీష్ యాస ఉన్న వారినే ఏంపిక చేసుకున్నట్లు తెలిసింది. విచారణలో కాల్ సెంటర్ నిర్వాహకులు నెలకు వీరికి 20వేల నుంచి 30వేల రూపాయలు వరకూ జీతం చెల్లిస్తున్నట్లు తేలింది, ఆ కార్యాలయం పై పోలీసులు సోదాలు మొదలు పెట్టగానే హడావిడిగా పలువురు ఉద్యోగులు కార్యాలయం నుండి పరుగులు తీశారు. ఇప్పటికీ ఈ కంపెనీ యజమాని ఏవరు అనే జాడ తెలియలేదు, ఈ కాల్ సెంటర్ నిర్వహించిన అసలు వ్యక్తి కోసం పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *