విజయవాడ: రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన. గుంటూరు నగరపాలెం పరిధిలో జూలై 15 న జరిగిన మహిళపై టిడిపి నాయకుల దౌర్జన్యకాండ పై వైసిపి మహిళా విభాగం రాష్ట్ర నాయకులు విజయవాడ లో చేపట్టిన భారీ నిరసన ర్యాలీ విజయవంతం.
ఇందులో పలువురు మహిళా వక్తలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయని, ఈ సంఘటనలో ఏకంగా టిడిపి నాయకులే ఉండడం తెలుగుదేశం పార్టీకి మహిళల భద్రతపై ఎంత మాత్రం బాధ్యత ఉందో తేటతెల్లమవుతుంది అన్నారు, ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మహిళలు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
ఈ యొక్క నిరసన కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారు, ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షులు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, ఎన్టీఆర్ జిల్లా అధక్షులు దేవినేని అవినాష్ గారు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మొండితోక జగన్మోహన్ రావు గారు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు, భారీగా మహిళా నేతలు కార్యకర్తలు, వైయస్ఆర్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు.
