₹50 కోట్ల శ్రీరంగం ఆలయ భూమి నకిలీ రిజిస్ట్రేషన్…!

Share Now

తిరుచిరాపల్లి:తమిళనాడు రాజకీయాల్లో భూ అక్రమాల వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. తిరుచిరాపల్లి (ట్రిచీ) పరిధిలోని ప్రసిద్ధ శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయానికి చెందిన అత్యంత విలువైన భూమిని డీఎంకే పార్టీకి చెందిన ఒక స్థానిక కీలక నేత నకిలీ పత్రాల సాయంతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కెట్ విలువల ప్రకారం ఈ భూమి ధర సుమారు ₹50 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్.. పార్టీ ఆఫీస్ నిర్మాణం

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న డీఎంకే నేత, ఆలయ అధికారుల కళ్లు గప్పి నకిలీ ఫోర్జరీ పత్రాలను సృష్టించి ఈ భూ బదలాయింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అంతటితో ఆగకుండా, ఆక్రమించిన సదరు ఆలయ స్థలంలోనే డీఎంకే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

రాజకీయ దుమారం – విపక్షాల విమర్శలు

ఈ వ్యవహారంపై తమిళనాడు హిందూ సమయ దేవాదాయ శాఖ మంత్రి ఎస్. రమేష్ స్పందిస్తూ.. గత డీఎంకే ప్రభుత్వం ఆలయ భూముల పరిరక్షణ విషయంలో ఐదేళ్లపాటు పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని మండిపడ్డారు. నకిలీ పత్రాలతో ఆలయ భూములు, చెరువులు, ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల హస్తం కూడా ఉండే అవకాశం ఉందని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, DMK పార్టీ నేతలే ఇలా దేవాలయ భూములను నకిలీ రిజిస్ట్రేషన్ల ద్వారా అపహరించడంపై స్థానిక ప్రజలు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, సదరు ₹50 కోట్ల విలువైన భూమిని తిరిగి ఆలయానికి స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *